మాచారెడ్డి, జూన్ 16 : మాచారెడ్డి మండలంలోని మంథనిదేవునిపల్లి గ్రామం లో కరోనాతో చనిపోయిన టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు సామల రామలింగం కుటుంబాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బుధవారం పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని బాధిత కు టుంబానికి భరోసా ఇచ్చారు. లక్ష్మీరావులపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ సిద్ధవ్వ కుమారుడు ప్రశాంత్ ఆత్మహత్య చేసుకోగా.. వారి కుటుంబాన్ని పరామర్శించా రు. ఆయన వెంట జడ్పీటీసీ సభ్యుడు మినుకూరి రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి బాల్చంద్రం, స ర్పంచ్ కొత్త అరవింద్, బూస శ్రీనివాస్, గోవింద్రెడ్డి, కూచని శేఖర్, బట్ట రమేశ్, కృష్ణారెడ్డి, గంగారెడ్డి, నవీన్రెడ్డి ఉన్నారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన డీసీసీబీ చైర్మన్
నస్రుల్లాబాద్, జూన్ 16 : నస్రుల్లాబాద్ మండలంలోని బస్వాయిపల్లి సర్పంచ్ ఫాతిమాబేగం, బీర్కూర్ మండలంలోని దామరంచ సర్పంచ్ అల్లం అంబయ్య, మల్లెల హన్మంతు, యాట సిద్ధులు, నారాయణరెడ్డి, రాజు ఇటీవల మృతిచెందారు. బాధిత కుటుంబాలను డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి బుధవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీకి విశేష సేవలందించిన వారు మృతిచెందడం పార్టీకి తీరనిలోటని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఎంపీపీ విఠల్, పీఏసీఎస్ చైర్మన్ పెర్క శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ప్రభాకర్రెడ్డి, సర్పంచ్ శ్యామల, రాము, చంటి, సాయిలు, హ న్మాండ్లు, సాయాగౌడ్ తదితరులు ఉన్నారు.
టీఆర్ఎస్ నాయకుడికి ఎమ్మెల్యే పరామర్శ
పిట్లం, జూన్ 16 : మండలకేంద్రానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ, టీఆర్ఎస్ నాయకుడు నర్సాగౌడ్ను జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే బుధవారం పరామర్శించారు. ఇటీవల నర్సాగౌడ్ కాలు విరగడంతో ఆయనను పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు విజయ్, జొన్న శ్రీనివాస్రెడ్డి, జగదీశ్, లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.