హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): సైబర్ సెక్యూరిటీ విషయంలో తెలంగాణ ముందున్నదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్రెడ్డి కొనియాడారు. హైదరాబాద్ సైబర్సెక్యూరిటీ హబ్గా మారడం హర్షణీయమ న్నారు. వెరిజన్ సంస్థ సైబర్ సెక్యూరిటీ అంశంపై రూపొందించిన డీబీఐఆర్ (డాటా బ్రీచ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్)-2021ను మంగళవారం ఆన్లైన్ ద్వారా కిషన్రెడ్డి విడుదలచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓవైపు టెక్నాలజీతోపాటు సైబర్ దాడులు, మోసాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ భద్రత అంశానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ మాట్లాడుతూ.. సైబర్దాడులను అరికట్టేందుకు తెలంగాణ ప్రభు త్వం ఎంతో కృషిచేస్తున్నదని తెలిపారు.యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రిఫ్మన్ మాట్లాడుతూ.. సైబర్ సెక్యూరిటీ అంశంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఇంటెలిజెన్స్ ఐజీ రాజేశ్కుమార్, హైదరాబాద్ సెక్యూరిటీ క్లస్టర్ సీఈవో జాకీఖురేషి, గ్లోబల్ కనెక్ట్ చైర్మన్ మతీన్ సయ్యద్ పాల్గొన్నారు.