జాతీయ పార్టీల పాలిత రాష్ర్టాల కంటే మనమే మెరుగు
ప్రభుత్వ వైద్యంపై సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు
పాలమూరులో అత్యాధునిక వైద్య సేవలు : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా బాధితులకు ఆత్మస్థైర్యం నింపడానికి సీఎం కేసీఆర్ దవాఖానల పర్యటన చేపట్టారని.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం సీఎం కేసీఆర్ చేస్తే.. ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కొవిడ్ బాధితులకు సీఎం ధైర్యం చెప్పారని.. ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తూ తమ వైఖరిని చాటుకుంటున్నాయన్నారు. ప్రతిపక్షాల వైఖరి దారుణంగా ఉందన్నారు. ప్రస్తుతం రాజకీయాలు మాట్లాడే సమయం కాదని.. ప్రజల ప్రాణాలను కాపాడే ప్రథమ కర్తవ్యమని మంత్రి స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన జాతీయ పార్టీలు విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కంటే కొవిడ్ కట్టడిలో తెలంగాణ ముందుందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యంపై భరోసా అందించిన ఘనత సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. కొవిడ్ కట్టడికి ప్రతిపక్షాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
రూ. 5కే అంత్యక్రియలు..
కొంతమంది కరోనా మహమ్మారితో ప్రాణాలను కో ల్పోయిన ఘటనలో వారి కుటుంబసభ్యులు భయంతో మృతదేహాన్ని దవాఖానలోనే వదిలేసి వెళ్లడం బాధాకరమన్నారు. అలాంటి వారి కోసం మహబూబ్నగర్ పట్టణంలో కేవలం రూ.5కే గ్యాస్ ఆధారిత ప్లాంట్ ద్వారా అంత్యక్రియలు చేయనున్నామన్నారు. దహన సంస్కారాలను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.5కే త్వరలోనే నిర్వహించబోతున్నామన్నారు. నెలరోజుల్లో రెండు ఎకరాల్లో గ్యాస్ ఆధారిత శ్మశానవాటికను ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ అధికారులకు సమాచారం ఇస్తే దహన సంస్కార ఏర్పాట్లు చేస్తారన్నారు. మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, చైర్మన్ అందరూ సమన్వయంతో కొవిడ్ బాధితులకు సహాయం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనాతో బాధపడుతూ హోం క్వారంటైన్లో ఉండే వారికి శాంతా నారాయణగౌడ్ ట్రస్ట్ ద్వారా ఇంటివద్దకే భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు.
పట్టణాభివృద్ధికి కృషి
మహబూబ్నగర్టౌన్, మే 23 : మహబూబ్నగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం క్లాక్టవర్ చౌరస్తా అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే భారత్ స్కౌట్ అండ్ గైడ్ ఆధ్వర్యంలో రూ.10లక్షలతో మీటింగ్హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.కోటీ 10లక్షలతో కలెక్టర్ బంగ్లా చౌరస్తా నుంచి హన్వాడ వెళ్లే రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధాన చౌరస్తాల అభివృద్ధి పనులతోపాటు, రోడ్డు విస్తరణ పనులను వేగంగా చేపడుతున్నామని తెలిపారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా మహమ్మా రి బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, డీఈ సంధ్య, కౌన్సిలర్లు రామ్, పటేల్ ప్రవీణ్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఖాజాపాషా, స్కౌట్ అండ్ గైడ్ ప్రతినిధులు పాల్గొన్నారు.