హైదరాబాద్ , నమస్తే తెలంగాణ : ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో రిపోర్ట్ చేసిన ఉద్యోగులకు అడ్హక్ జీతాలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయినవారికి నెలకు రూ.30 వేల చొప్పున అడ్హక్ జీతం ఇవ్వనున్నారు. ఇలా ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన వారు 491 మంది ఉన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు చెందిన పలువురు ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. విభజన జరిగిన సమయం నుంచి తమను తెలంగాణకు తీసుకెళ్లాలంటూ క్లాస్ -3 (116 మంది) , క్లాస్-4 (582 మంది) తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దాంతో ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో.. వారిని తెలంగాణకు కేటాయిస్తూ గత మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఏప్రిల్ 17 నుంచి మే 19 వ తేదీ వరకు 491 మంది డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వద్ద జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. వీరికి జాయిన్ అయిన రోజు నుంచి నెలకు రూ.30 వేల చొప్పున అడ్హక్ జీతం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన జీతభత్యాలను రెగ్యులర్ ఉద్యోగాల్లో చేరిన తర్వాత చెల్లిస్తామని పేర్కొన్నది.
పీహెచ్ జ్యువెల్స్కు డీఆర్ఐ నోటీసుపై హైకోర్టు స్టే
అది కాపీరైట్ ఉల్లంఘనే: ఢిల్లీ హైకోర్టు
రెజ్లర్ సాగర్ హత్య కేసులో ఒలింపియన్ సుశీల్ అరెస్ట్
ఆఫ్ఘాన్లో జిల్లాను ఆక్రమించిన తాలిబాన్లు.. దాడుల్లో 40 మంది తాలిబాన్లు హతం
మార్స్పై పని మొదలుపెట్టిన చైనా రోవర్
సూకీ ఆరోగ్యంగానే ఉన్నారు : జుంటా నేత హ్లింగ్
కరోనా వేళ మోదీ, సోనియా, ఇతర యూపీ ఎంపీలు ఎక్కడున్నారు.. ఏంచేస్తున్నారు..?
సువేందు అధికారి తండ్రి, సోదరుడికి వై ప్లస్ భద్రత
సంగీత దర్శకుడు రామ్లక్ష్మణ్ కన్నుమూత
వ్యాక్సిన్ల కొరత ప్రభుత్వ అలక్ష్యం వల్లే: ఎస్ఐఐ ఈడీ సురేశ్ జాదవ్
ఎగిరే యంత్రానికి రైట్ బ్రదర్స్కు పేటెంట్.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..