శ్రీనగర్ : కొవిడ్-19 కట్టడికి అమలవుతున్న కరోనా కర్ఫ్యూను మే 31 వరకూ పొడిగించినట్టు జమ్ము కశ్మీర్ అధికార యంత్రాంగం శనివారం వెల్లడించింది. మే 24తో కరోనా నియంత్రణలు ముగియనుండటంతో మహమ్మారి కట్టడికి కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.
కర్ఫ్యూ నుంచి నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో జమ్ము కశ్మీర్ లో 3848 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజే 43 మంది ప్రాణాలు కోల్పోయారు.