అమరావతి : పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ఖండిస్తున్నామని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రభుత్వ తీరుపై లోక్సభ స్పీకర్ సుమోటోగా విచారణకు ఆదేశించాలని కోరారు.
జరిగిన పరిణామాలను చూస్తే ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఉండే హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాసినట్లు స్పష్టమవుతున్నది ఆయన పేర్కొన్నారు. విచారణ పేరుతో ఎంపీ పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియెగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ కక్షసాధింపులు, అణచివేత ధోరణితో వైసీపీ ప్రభుత్వం ఏం సాధించలేదని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.