ఘట్కేసర్, మే 13 : కరోనాను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్యాచరణపై నియోజక వర్గ ప్రజాప్రతినిధులతో గురువారం ఘట్కేసర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి మల్లారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కోసం సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కళాశాల సౌజన్యంతో 300పడకల ఉచిత ఐసొలేషన్ సెంటర్ను అందుబాటులో ఉంచామని, కరోనా లక్షణాలు ఉంటే అందులో చేర్పించాలని సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్ శరత్చంద్రారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ వెంకట్రెడ్డి, మల్లారెడ్డి హెల్త్సిటీ చైర్మన్ డాక్టర్ బద్రారెడ్డి, డీఎంహెచ్ఓ మల్లికార్జున్, మున్సిపాలిటీ చైర్పర్సన్ పావనీజంగయ్య యాదవ్, మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.