తెలుగుయూనివర్సిటీ, మే 12 : జీవ వైవిధ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జీవ వైవిధ్య మండలి రాష్ట్ర కార్యదర్శి కాళీచరణ్ అన్నారు. తెలంగాణ జీవ వైవిధ్య మండలి, సాగర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంయుక్తంగా మే22న నిర్వహించనున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను సైఫాబాద్లోని అరణ్యభవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెయింటింగ్, ఫొటోగ్రఫీ, వ్యాసరచన, నృత్యం, కార్టూన్ డిజైన్, క్విజ్, ఫ్యాన్సీడ్రెస్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 20లోపు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9010591666లో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాగర్సాఫ్ట్వేర్ సొల్యూషన్ సీఈఓ జోగి రితేశ్, వెంకట్, అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.