దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన బౌలింగ్ ర్యాంకింగ్స్లో
టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ ఒక్కడే టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.
టెస్టు ఫార్మాట్లో అశ్విన్ 850 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఫాస్ట్బౌలర్ బుమ్రా 11వ ర్యాంక్లో నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ 908 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఐసీసీ పురుషుల టెస్టు ప్లేయర్ ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ బౌలర్లు హసన్ అలీ, నౌమన్ అలీ, షాహీన్ అఫ్రిదీ తమ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. జింబాబ్వేపై సిరీస్ విజయం సాధించడంలో ఈ ముగ్గురు ప్రధాన పాత్ర పోషించారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కేన్ విలియమ్సన్ 919 పాయింట్లతో నంబర్వన్గా కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ(814) ఐదు, రిషబ్ పంత్(747) ఆరో స్థానంలో ఉండగా రోహిత్ శర్మ(747) ఎనిమిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు.