తాండూరు, మే 1: ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, మున్సిపల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్, హమాలీ, దడువాయి, గుమాస్త, బండి, చాట కార్మిక, ఆర్టీసీ సంఘాల నేతలు ఎర్ర జెండాలను ఎగురవేసి స్వీట్లు పంచిపెట్టారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో జరిగిన మేడే సంబురాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, జేఏసీ జిల్లా చైర్మన్ సోమశేఖర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పలు పార్టీల నేతలు, కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
పరిగిలో..
పరిగి, మే 1 : మేడే సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో సీపీఎం నాయకులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు పరిగిలోని మున్సిపల్ కార్యాలయం, తాసిల్దార్, ట్రాన్స్కో కార్యాలయం వద్ద జెండాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకుడు వెంకటయ్య, నాయకులు రామకృష్ణ, హబీబ్ పాల్గొన్నారు.
చౌడాపూర్లో..
కులకచర్ల, మే 1: కులకచర్ల మండల పరిధిలోని చౌడాపూర్ గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మేడే కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శంకర్, వార్డు సభ్యుడు అశోక్, గౌస్, కృష్ణ, పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, పారిశుధ్య కార్మికులు మాసయ్య, ఈశ్వరయ్య, శ్రీను, గ్రామస్తులు పాల్గొన్నారు.
బాస్పల్లి కార్మికులకు సన్మానం
దోమ, మే 1 : బాస్పల్లి గ్రామ కార్మికులకు కార్మిక దినోత్సవం సందర్భంగా గ్రామ పాలకవర్గం పారిశుధ్య కార్మికులు, కారోబార్, ఆశ వర్కర్లను సన్మానించినట్లు సర్పంచ్ పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యమ్రంలో ఉప సర్పంచ్ బుచ్చిరెడ్డి, కార్యదర్శి చంద్రకాంత్, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇప్పాయిపల్లి పంచాయతీ కార్మికులకు..
కులకచర్ల, ఏప్రిల్ 1: మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులను సన్మానించి పండ్లు అందజేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు ధ్యానమోని శ్రీనివాస్, బీసీ సంఘం గ్రామ అధ్యక్షుడు చెన్నయ్య, మత్స్యకారుల సంఘం గ్రామ అధ్యక్షుడు ఆంజనేయులు, రాములు, మహేశ్, అంజిలయ్య, రవి, ఓంకార్, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
తాండూరు మండలంలో..
తాండూరు రూరల్, మే 1 : తాండూరు మండలంలోని సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ, పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ, ది ఇండియన్ సిమెంట్ ఫ్యాక్టరీ లో కార్మిక నాయకులు ఎర్ర జెండాను ఎగురవేసి, మే డేను ఘనంగా నిర్వహించారు. కార్మిక నాయకులు జనార్దన్రెడ్డి, విజయలక్ష్మీపండిత్, హేమంత్కుమార్, దశరథ్, దస్తప్ప, రవీందర్, అశోక్, విజయ్, రాజేందర్ పాల్గొన్నారు.