బీబీపేట్/నిజాంసాగర్/కామారెడ్డి రూరల్/ దోమకొండ, ఏప్రిల్ 28: : కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ బాలమణి అన్నారు. బీబీపేట్ మండలకేంద్రంతోపాటు సొసైటీ పరిధిలోని 10 గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు, సొసైటీ డైరెక్టర్లతో కలిసి బుధవారం ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ సత్యనారాయణ, సొసైటీ డైరెక్టర్లు, రైతుబంధు సమితి సభ్యులు, సొసైటీ ఇబ్బంది, రైతులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ మండలంలోని నర్వ గ్రామంలో గున్కుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ వైస్ చైర్మన్ నర్సింహులు బుధవారం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీఈవో రాములు, నాయకులు దుర్గాప్రసాద్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.కామారెడ్డి పట్టణ పరిధిలోని అడ్లూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఒకటో వార్డు కౌన్సిలర్ గడ్డమీది రా ణి మహేశ్ ప్రారంభించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి కన్వీనర్ లోలపు సాయిలు, గ్రామస్తులు సత్యనారాయణగౌడ్, మేడిపల్లి నర్సింహులు పాల్గొన్నారు.దోమకొండ మండలంలోని చింతమాన్పల్లిలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇన్చార్జి విండో చైర్మన్ సిద్ధరాములు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్సవ్వ, ఎంపీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి, సీఈవో రామచంద్రం, ఏఈవో కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం తనిఖీ
మండలంలోని సింగీతం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ వేణుగోపాల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని గున్కుల్, అచ్చంపేట, మల్లూర్ సొసైటీల ఆధ్వర్యంలో మండలంలో మొత్తం 22 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తూకం పూర్తయిన ధాన్యాన్ని లారీల ద్వారా రైస్మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు.పిట్లం మండలం బుర్నాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ రామ్మో హన్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తూకం వేయాలని కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. ఆయన వెంట చిన్నకొడప్గల్ విండో చైర్మన్ నారాయణరెడ్డి, సిబ్బంది ఉన్నారు.