ఆదిలాబాద్ : జిల్లాలోని భీంపూర్ మండలం పెన్గంగ పరీవాహక సరిహద్దు గ్రామాలకు సమీపంలో ఉన్న మహారాష్ట్ర గ్రామాల్లో పెద్దపులి భయం నెలకొన్నది. మహారాష్ట్ర గాటంజీ తాలూకా పార్వ సమీపం పింప్రి గ్రామ శివారు చేనులో శుక్రవారం సాయంత్రం పెద్ద పులి ఒక చెట్టుకింద కూర్చొని ఉన్న విషయాన్ని రైతులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
వారు వచ్చి బోను, మత్తు ఇంజెక్షన్లతో రాగా సిబ్బందిపై పులి దాడిచేసి ఇద్దరిని గాయపరిచిందని స్థానికుడు నితిన్ పెంచల్వార్ చెప్పారు. తర్వాత రాత్రి వరకు అతికష్టం మీద పులిని సమీప తిప్పేశ్వర్ అభయారణ్యంలోకి తరలించారు.
తిప్పేశ్వర్ నుంచి పులులు దాహం తీర్చుకునేందుకు పెన్గంగ వైపు వస్తాయని, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కొత్తూరును కొత్తగా మారుస్తాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఆలోచించి ఓటు వేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి
అందరినీ ఒకే తీరుగా చూసే ఏకైక పార్టీ టీఆర్ఎస్
పాక్ డ్రోన్లపై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు