హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కరోనా బాధితుల కోసం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే దవాఖానల్లో కావల్సినన్ని బెడ్లు సిద్ధంగా ఉంచగా, రైల్వే బోగీలను కూడా వాడుకోవాలని నిర్ణయించింది. దీనిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులకు లేఖ రాసింది. ఇప్పటికే దక్షిణమధ్యరైల్వే ఆధ్వర్యంలో 450కి పైగా రైల్వే బోగీలు కరోనా చికిత్స అందించేందుకు రెడీగా ఉన్నాయి. ఒక్కో బోగీలో 16 నుంచి 20 మందికి వైద్యం అందించేలా అన్ని సదుపాయాలతో ఏర్పాట్లు చేశారు.