చండీగఢ్: దేశంలో కరోనా కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతున్నది. సామాన్యులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, సినిమా స్టార్లు కరోనా సోకి మరణించగా.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్సింగ్ హుడాకు, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది.
ప్రస్తుతం ఆ ఇద్దరూ మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని భూపిందర్సింగ్ హుడానే స్వయంగా మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతానికి అయితే తమలో కరోనా లక్షణాలు ఏవి కనిపించడంలేదని, తాము ఆరోగ్యంగానే ఉన్నామని హుడా తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బద్రీనాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం.. వీడియో
కమలా హారిస్ను చంపేస్తామని బెదిరింపులు.. నర్సు అరెస్ట్
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
మార్కెట్లో కొనితెచ్చిన పాలకూరలో పాముపిల్ల.. వీడియో
వీళ్లు కేరళ జాతిరత్నాలు.. వీళ్ల నటన అమోఘం.. వీడియో