న్యూఢిల్లీ: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో హైదరాబాదీ స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్కు చోటు దక్కింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ చరిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్ తొలిసారి బీసీసీఐ కాంట్రాక్టు కైవసం చేసుకున్నాడు. గ్రేడ్ ‘సి’లో ఉన్న సిరాజ్కు కోటి రూపాయలు దక్కనున్నాయి. మిగతావారి విషయానికొస్తే కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్శర్మ, బుమ్రా ‘ఎ+’ గ్రేడ్ నిలబెట్టుకోగా, కొత్తగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ప్రమోషన్ లభించింది. గాయంతో కీలక సిరీస్లకు దూరమైన భువనేశ్వర్ కుమార్కు డిమోషన్ కింద గ్రేడ్ ‘ఎ’ నుంచి ‘బి’కి పడిపోగా, సీనియర్ కేదార్ జాదవ్కు చుక్కెదురైంది.