డివిజన్ల వారీగా కేటాయింపు పూర్తి
టరీలతో తేలిన లెక్క
టీఆర్ఎస్లో టికెట్ల కోసం పోటాపోటీ
గెలుపుపై నమ్మకంతో పెరుగుతున్న ఆశావహులు
వరంగల్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కీలక అంకం మొదలైంది. డివిజన్ల వారీగా రిజర్వేషన్లు ఖరార య్యాయి. ఆయా కేటగిరీల కోటా ఆధారంగా జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్గాంధీ హన్మంతు ఆధ్వర్యంలో కలెక్టరేట్లో డివిజన్ల వారీగా రిజర్వేషన్లను ప్రకటించారు. వారం క్రితం కేటగిరీ వారీగా వార్డుల సంఖ్యను ప్రకటించిన ఎన్నికల అధికారులు గురువారం డివిజన్ల ప్రక్రియ పూర్తి చేశారు. వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రేటర్ వరంగల్ ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ను ప్రకటించింది. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎన్ని కల నియమావళి అమల్లోకి వచ్చింది. డివిజన్ల వారీగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. మొత్తం 66 డివిజన్లలో 50 శాతం అంటే 33 డివిజన్లు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఆయా కేటగిరీలకు కేటాయించిన డివిజన్లలో సగం చొప్పున లాటరీ పద్ధతిలో మహిళలకు కేటాయించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డివిజన్ల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారైంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయంగా సందడి మొదలైంది. డివిజన్ల వారీగా ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
గెలుపు ఖాయమనే నమ్మకం..
టీఆర్ఎస్ టికెట్ దక్కితే గెలుపు ఖాయమనే నమ్మకంతో పార్టీలో అభ్యర్థిత్వానికి పోటీ పెరుగుతున్నది. టీఆర్ఎస్ అధి ష్టానం ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి గ్యా దరి బాలమల్లు, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వరంగల్కు వచ్చారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ని డివిజన్లలో టికెట్ ఆశిస్తున్న వారు దరఖాస్తు చేసుకోవా లని పార్టీ అధిష్టానం సూచించింది. ఈ మేరకు ఆశావహులు ఆయా డివిజన్లకు తమ పేరు పరిశీలించాలని దరఖాస్తు చేసు కుంటున్నారు. దరఖాస్తుల స్వీకరణ కోసం హన్మకొండలో ప్రత్యేకంగా కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపు నేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ఖాన్, టీఆర్ఎస్ ముఖ్యనేతల సమ న్వయంతో దరఖాస్తుల ప్రక్రియ నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
విషాదం : నీటి సంపులో పడి బాలుడు మృతి