న్యూఢిల్లీ : భారత్ లో చిన్న, మధ్యతరహా వ్యాపారాలు, స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు అమెజాన్ ఇండియా గురువారం 250 మిలియన్ డాలర్లతో వెంచర్ ఫండ్ ను ప్రకటించింది. ఈ నిధులను ప్రధానంగా ఆయా వ్యాపారాల డిజిటలీకరణ, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణలపై వెచ్చిస్తారు. సాంకేతిక రంగంలో పనిచేసే స్టార్టప్ ల్లోనూ వెంచర్ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది.
డిజిటల్ సాధికారతకూ అమెజాన్ పెద్దపీట వేయనుంది. పది లక్షల మంది ఆఫ్ లైన్ రిటైలర్లను అమెజాన్ వేదికపై ఆన్లైన్ బాట పట్టించేందుకు సహకరిస్తుంది. 50,000 మంది చేతివ`త్తి కళాకారులుచ చేనేతలు, చిరువ్యాపారులను లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్ కింద తమ వేదికపైకి తీసుకొస్తామని అమెజాన్ సీఈఓ బాద్యతలు చేపట్టనున్న ఆండీ జసీ పేర్కొన్నారు.