హైదరాబాద్ : బ్యాచ్లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సు మార్గదర్శకాలను ప్రభుత్వం సవరించింది.
బ్యాచ్లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) పట్టభద్రులు కూడా బీఈడీ కోర్సు చేసేందుకు అవకాశం కల్పించింది.
ఇతర పట్టభద్రుల్లాగే ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు బీఈడీ చదవొచ్చని తెలిపింది.
ఇంజినీరింగ్ చేసి బీఈడీ చేయాలనుకునే వారికి కనీస అర్హత మార్కులు 50శాతానికి తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి