బోనకల్లు, ఏప్రిల్ 9: టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు చొరవతో మండలంలో పలుగ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి రూ.2,56,100 విలువ గల చెక్కులను మండలంలోని చిన్నబీరవల్లిలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు లబ్ధిదారులకు అందజేశారు. తొలుత రాపల్లెలో ఉపాధిహామీ ఫీల్డ్అసిస్టెంట్ రవికుమార్ అనారోగ్యంతో మృతి చెందగా లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి చేబ్రోలు మల్లికార్జునరావు, మండల కార్యదర్శి కల్యాణపు నాగేశ్వరరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్, నాయకులు తన్నీరు రవికుమార్, మాజీ జడ్పీటీసీ బానోతు కొండ, సర్పంచ్లు కొమ్మినేని ఉపేందర్, శాంతయ్య, చిలకా వెంకటేశ్వర్లు, మందడపు తిరుమలరావు, ఎంపీటీసీ చేపూరి సునీత నాయకులు యనమద్ది శ్రీనివాసరావు, గద్దల వెంకటేశ్వర్లు, రెడ్డబోయిన ఉద్దండు, కన్నేటి సురేశ్, కాకాని శ్రీనివాసరావు, గుమ్మా నాగేశ్వరరావు, ఇటికాల శ్రీనివాసరావు, కనకయ్య, సండ్ర వెంకట్రావు, తోటకూర అనంతరాములు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న మల్లాది వాసు
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లాది వాసు, నాయకులు చావా రవి శుక్రవారం జడ్పీ చైర్మన్ సమక్షంలో టీఆర్ఎస్ కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, పట్టణ బాధ్యులు కనుమూరి వెంకటేశ్వరరావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు చావా వేణు, శివాలయం చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు, నాయకులు కోన నరేందర్రెడ్డి, జే.వీ.రెడ్డి, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.