నిడమనూరు, ఏప్రిల్ 8 : సంక్షేమం, అభివృద్ధి టీఆర్ఎస్ ఎజెండా అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు మద్దతుగా గురువారం వారు నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని ఊట్కూరు, నందికొండ వారిగూడెం, ఎర్రగూడెం, లక్ష్మీపురం, మారుపాక, వెంకటాపురం, ఎర్రబెల్లి, గుంటిపల్లి, వేంపాడు, వెంగన్న గూడెం, బీకే పహాడ్, ముకుందాపురం గ్రామాల్లో ప్రచారం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం బడ్జెట్లో రూ.11 వేల కోట్లు కేటాయించిందన్నారు. నాలుగు నెలల్లో అర్హులందరికీ ఇండ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ప్రచారంలో అభ్యర్థి నోముల భగత్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మె ల్సీ తేరా చిన్నపరెడ్డి, మిర్యాలగూడ, కోదాడ, నకిరేకల్ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి పాల్గొన్నారు.