ఆమనగల్లు, ఏప్రిల్7: కరోనా రెండవ దశ విస్తరించకుండా ప్రభు త్వ సూచనల ప్రకారం మండలంలో కరోనా నిబంధనలను కఠి నతరం చేయాలని మండల కరోనా సమన్వయ కమిటీ సమా వేశంలో అధికారులు తీర్మానం చేశారు. బుధవారం మండ లంలోని తాసీల్దార్ కార్యాలయం ఆవరణలో వివిధ శాఖల కు సంబంధించిన అధికారులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సమావేశానికి తాసిల్దార్ చందర్రావు, ఎంపీవో ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ శ్యామ్సుందర్, మెడికల్ అధికారి రవి కుమార్ , ఎస్ఐ ధర్మేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తాసీల్దార్ చందర్రావు మాట్లాడుతూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కరోనా ను జయించేందుకు ప్రతీ ఒక్కరూ విధిగా ముందుకు వచ్చి తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు.
మాడ్గుల ఏప్రిల్ 7: మండల కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ ఎంపీపీ గౌ రారం పద్మ ప్రారంభించారు. వ్యాక్సినేషన్ ప్రారంభం సందర్భం గా పలువురు వివిధ శాఖల అధికారులు, ప్రజలు వ్యాక్సిన్ తీసు కొన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ కృష్ణ, ఎంపీడీ వో ఫారుఖ్ హుస్సేన్,డాక్టర్ లలిత తదితరులు పాల్గొన్నారు.