ఉప్పల్, ఏప్రిల్ 5 : బలహీనవర్గాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రాంతంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని క్షౌరశాలలకు, లాండ్రీలు, దోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా ఇస్తూ జీవో జారీ చేయడం హర్షణీయమన్నారు. బలహీనవర్గాలు, పేదలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటారని మరోసారి రుజువు చేశారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా తగిన చర్యలు చేపట్టిందన్నారు. ప్రతి కుటుంబానికి లబ్ధిచేకూరేలా సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. దోబీఘాట్లు, క్షౌరశాలలు, లాండ్రీలకు ఉచితంగా విద్యుత్ అందించడం హర్షణీయమన్నారు. దీనితో ఎంతోమందికి మేలు జరుగుతుందని తెలియజేశారు. బలహీన వర్గాలు ఎక్కువగా ఆధారపడి జీవించే రంగాలకు తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు.