వనపర్తి జిల్లా దవాఖానకు మంజూరు
అదనపు యూనిట్లతో 100మందికి డయాలసిస్ సేవలు
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి
వనపర్తి, ఏప్రిల్ 3 : వనపర్తి జిల్లా దవాఖానకు అదనంగా ఐదు డయాలసిస్ యూనిట్లు మంజూరైనట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లా దవాఖానలో ఉన్న డయాలసిస్ ద్వా రా 47 మంది చికిత్స పొందుతుండగా, రోజుకు 20 డయాలసిస్ చొప్పున సేవలందిస్తున్నారన్నారు. 130 మంది పేర్లు నమోదు చేసుకోగా, యూనిట్లు అందుబాటులో లేక ఇతర జిల్లాలకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గతంలో ఉన్న ఐదు డయాలసిస్ యూనిట్లకు అదనంగా ఐదు యూనిట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దీంతో 100 మంది వరకు డయాలసిస్ చేయించుకునే అవకాశం ఉం టుందన్నారు. హైదరాబాద్కే పరిమితమైన డయాలసిస్ చికిత్సను జిల్లా, డివిజన్ స్థాయి ప్రభుత్వ దవాఖానలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్లకు మంత్రి నిరంజన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఇవికూడా చదవండి..
రోబో వేసిన పెయింటింగ్కు రూ.5 కోట్లు