పోలీస్స్టేషన్లో పూజలందుకున్న స్వామివారు
ఘనంగా దక్షిణ దిగ్యాత్ర
తరలివచ్చిన భక్తజనం
కనులపండువగా వేంకటేశ్వరుడి తెప్పోత్సవం, డోలోత్సవం
ధర్మపురి, మార్చి 30: నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం లక్ష్మీనర్సింహ స్వామి(ఉగ్ర, యోగా) వారి దక్షిణ దిగ్యాత్ర ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి సేవలను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి పూజ లు నిర్వహించారు. డీఎస్పీ వెంకటరమణ, సీఐ రాంచందర్రావు, ఎస్ఐ కిరణ్కుమార్, పోలీస్ సిబ్బంది సేవలను మోస్తూ స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు. అనంతరం పోలీస్స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తుల ను ఆసీనుల్ని చేసి, స్వామివారల ఎదుట ఆయుధాలను ఉంచి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేశా రు. పోలీసు కుటుంబ సభ్యుల మధ్య స్టేషన్లో పూజల నిర్వహణ ఆనందంగా ఉందని డీఎస్పీ వెంకటరమణ పేర్కొన్నారు.
వేంకటేశ్వరుడి తెప్పోత్సవం.. డోలోత్సవం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవం, డోలోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మధ్యాహ్నం స్వామివార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి బ్రహ్మ పుష్కరిణిలో హంసవాహనంపై ఆసీనుల్ని చేసి ఐదుసార్లు ప్రదక్షిణలు చేయించారు. అనంతరం పుష్కరిణి మధ్యలో ఉన్న మండపంలోని ఊయలపై స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉం చి డోలోత్స వం నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకు లు నేరెళ్ల శ్రీనివాసాచార్య, ముఖ్య అర్చకులు రాత్రి వరకూ ఉత్సవాన్ని కొనసాగించారు. ఆలయ ఈవో శ్రీనివాస్, డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జడ్పీటీసీ అరు ణ, ఏఎంసీ చైర్మన్ రాజేశ్కుమార్, వైస్ చైర్మన్ సునీల్కుమార్ పాల్గొన్నారు.