రామారెడ్డి, మార్చి 29 : మండలకేంద్రంలోని 14వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ సంజీవ్ సోమవారం ప్రారంభించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఎమ్మెల్సీ నిధులు రూ. 5 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, వార్డుసభ్యురాలు దోమల లక్ష్మి, టీఆర్ఎస్ నాయకుడు పడిగెల రత్నాకర్, టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
శెట్పల్లి సంగారెడ్డిలో..
లింగంపేట, మార్చి 29: మండలంలోని శెట్పల్లిసంగారెడ్డిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ గరీబున్నీసా బేగం ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన రూ. 5 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అనిల్రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు బోధనపు ఇందిర, మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు బాబుజానీతో పాటు వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనుల పరిశీలన..
మండలంలోని మెంగారం గ్రామ రహదారి నుంచి నాగిరెడ్డిపేట మండలంలోని మల్తూమ్మెద వరకు చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ గరీబున్నీసా బేగం పరిశీలించారు. రహదారి విస్తరణతోపాటు కల్వర్టుల నిర్మాణం చేపడుతున్నారు. మండలంలోని అయ్యపల్లి, పర్మళ్ల గ్రామాల వద్ద నిర్మాణం చేపడుతున్న కల్వర్టును పరిశీలించారు. ఎంపీపీ వెంట టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకుడు నయీం తదితరులు ఉన్నారు.
ఇవీ కూడా చదవండి..
ఉద్యోగులు ఖుషీ : వారానికి నాలుగు రోజుల పని షురూ!
ఎల్ఐసీ లిస్టింగ్తోనే రూ.లక్ష కోట్లు.. ఫక్కాగా డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం