దుబాయ్: భారత ఫుట్బాల్ జట్టుకు భారీ ఓటమి ఎదురైంది. అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ల్లో భాగంగా సోమవారం జరిగిన పోరులో భారత్ 0-6 తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) చేతిలో పరాజయం ఎదుర్కొంది. తమ కంటే మెరుగైన ర్యాంక్లో ఉన్న యూఏఈకి ఏమాత్రం పోటీనివ్వలేకపోయిన బ్లూటైగర్స్ సత్తాచాటడంలో విఫలమయ్యారు. యూఏఈ తరఫున అలీ(12ని, 32ని, 60ని) హ్యాట్రిక్ గోల్స్తో అదరగొట్టగా, ఇబ్రహీమ్(64ని), ఫాబియో వర్జినో(71ని), సెబాస్టియన్(84ని) ఒక్కో గోల్ చేశారు.
ఇవి కూడా చదవండి: