న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. సీనియర్ సిటిజన్ల కోసం ప్రకటించిన ప్రత్యేక డిపాజిట్ స్కీం కాలపరిమితిని జూన్ 30దాకా పెంచింది. ఇలా పెంచడం ఇది మూడోసారి. ఈ స్కీం కింద సీనియర్ సిటిజన్లకు అదనంగా 75 బేసిస్ పాయింట్ల వడ్డీని చెల్లిస్తున్నది. గతేడాది మేలో ‘సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ స్కీం’ను బ్యాంక్ ప్రకటించినది తెలిసిందే. ఎఫ్డీలపై 6.25 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. ఐదు నుంచి 10 ఏండ్లలోపు రూ.5 కోట్ల దిగువన ఫ్డీలపై అదనంగా పావు శాతం వడ్డీని చెల్లిస్తున్నది.
ఇవి కూడా చదవండి:
అప్పుపై కొనే కంటే లీజు కారు చౌక!
కరోనా మృతుల బీమా క్లెయిమ్స్: రూ.1,986 కోట్లు
త్వరలోనే స్పుత్నిక్-వీకి అనుమతి