ఆధునిక తెలంగాణ వైతాళికుడు, సాంఘిక చరిత్ర నిర్మాత, తెలంగాణ పునరుజ్జీవన దశకు నాంది పలికిన సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాలు జోగిపేటలోని వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 2021 మార్చి 31న ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అధ్యక్షతన జరుగు సభలో మంత్రి హరీశ్రావు, సురవరం ప్రతాపరెడ్డి కుమారుడు డాక్టర్ కృష్ణవర్ధన్రెడ్డి-ఇతర కుటుంబ సభ్యులు, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డాక్టర్ చెన్నయ్య తదితరులు హాజరవుతారు.