పారిస్: లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్.. ఒర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. నాలుగోసారి ఒలింపిక్స్కు అర్హత సాధించాలని పట్టుదలగా ఉన్న సైనా ర్యాంకింగ్స్ పాయింట్లు దక్కించుకొని రేసులోకి రావాలని భావిస్తున్నది.
బీడబ్ల్యూఎఫ్ సవరించిన ఒలింపిక్ అర్హత వ్యవధిలో భాగమైన సూపర్ 100 ఈవెంట్లో 51 నిమిషాలపాలు కొనసాగిన గేమ్లో 65 నంబర్ మేరీని 18-21, 21-15, 21-10 తో ఓడించి క్వార్టర్ ఫైనల్కు చేరింది. తొడ గాయం కారణంగా గత వారం జరిగిన ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ నుంచి వైదొలిగిన సైనా నెహ్వాల్.. క్వార్టర్స్లో ఫ్రాన్స్కు చెందిన యాయెల్ హోయాక్స్ లేదా మలేషియాకు చెందిన ఐరిస్ వాంగ్ను ఎదుర్కోవలసి ఉంటుంది.
మరోవైపు 162 వ స్థానంలో ఉన్న ఇరా శర్మ కూడా క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నది. ఐరా శర్మ.. బల్గేరియాకు చెందిన మరియా మిట్సోవాను 21-18, 21-13 స్కోరుతో 32 నిమిషాల్లో మట్టికరిపించింది. ఈ 21 ఏండ్ల యువతి తదుపరి గేమ్లో డెన్మార్క్కు చెందిన లైన్ క్రిస్టోఫెర్సన్తో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.
కాగా, బుధవారం మహిళల డబుల్స్లో కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేతలు అశ్విని పొన్నప్ప, ఎన్ సిక్కి రెడ్డి జంట డెన్మార్క్ జంట అమాలీ మాగెలుండ్, ఫ్రీజా రావ్న్ను 21-9, 17-21, 21-19తో విజయం సాధించారు.
ఏడవ సీడ్ పురుషుల డబుల్స్ జంట ఎంఆర్ అర్జున్, ధ్రువ్ కపిలా 21-14, 21-16 తో ఇంగ్లిష్ జోడి మాథ్యూ క్లేర్, ఏతాన్ వాన్ లీయువెన్పై విజయం సాధించారు. మరో భారతీయ పురుషుల డబుల్స్ జోడి కృష్ణ ప్రసాద్ గరాగా, విష్ణు వర్ధన్ గౌడ్ పంజాలా 21-10, 21-17 తో ఇండోనేషియా జంట అబియు ఫౌజన్ మజిదాండ్, హబీబ్ అల్ఫారిజ్ను ఓడించారు.
అయితే, మిథున్ మంజునాథ్ 21-23, 21-9, 22-24తో జర్మనీకి చెందిన కై షెఫర్ చేతిలో ఘోరమైన ఓటమిని చవిచూశాడు.
వదులుగా సిగరెట్ల అమ్మకం నిలిపేయవద్దంటున్న స్మోకింగ్ ప్రియులు
2030 కల్లా ఎగురనున్న హైబ్రిడ్ ట్రైప్లేన్
పుతిన్కు వ్యాక్సిన్.. ఫొటో విడుదల చేయకపోవడంపై అనుమానాలు
రైల్వే ప్లాట్ఫాంపై ఏనుగు.. పరుగులు తీసిన ప్రయాణికులు
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
25 ఏండ్ల క్రితం వీకీవీకీవెబ్ ప్రారంభం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..