ముంబై: బాలీవుడ్ మేటి రచయిత, డైరక్టర్ సాగర్ సర్హదీ ఇవాళ ముంబైలో కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏళ్లు. ఫేమస్ రైటర్గా గుర్తింపు పొందిన సాగర్ సర్హదీ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్క్రిప్ట్ రైటింగ్ లో సాగర్కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. నూరీ, బాజార్, కబీ కబీ, సిల్సిలా, చాందినీ, దీవానా, కహోనా ప్యార్ హై లాంటి చిత్రాలకు సాగర్ వర్క్ చేశారు. ఉర్దూ భాషలో నాటకాలు రాయడంలోనూ ఈయనకు ప్రత్యేకత ఉంది. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్.. సర్హదీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. 1976లో సూపర్ హిట్ అయిన కబీ కబీ చిత్రానికి డైలాగ్స్ రాసింది ఈయనే. ఆ సినిమాకు బెస్ట్ డైలాగ్ రైటర్గా ఆయనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. యశ్ చోప్రా డైరక్షన్ చేసిన ఆ సినిమాలో అమితాబ్, శశీకపూర్, రాఖీ, వహీదా రెహ్మాన్, రిషీ కపూర్, నీతూ సింగ్లు నటించారు. కబీ కబీ తర్వాత సర్హదీ డైలాగులు రాసిన చిత్రాల్లో నూరీ(1979), చాందినీ(1989) ఉన్నాయి. 1981లో ఆయన సిల్సిలాకు కూడా డైలాగులు చేశారు.