ఇండస్ట్రీలో ఏదైనా బ్లాక్ బస్టర్ సినిమా వచ్చినపుడు ఎందుకో తెలియదు కానీ దాని తర్వాత చాలా వారాల వరకు కూడా మరో బ్లాక్ బస్టర్ కనిపించదు. ఎప్పట్నుంచో వస్తున్న ఆనవాయితీ ఇది. ఆ సదరు బ్లాక్ బస్టర్కు మరిన్ని సినిమాలు వచ్చి దారి ఇస్తుంటాయి. కావాలంటే చూడండి.. ఫిబ్రవరి 12న ఉప్పెన విడుదలైన తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ కోసం చాలా రోజుల పాటు వేచి చూడాల్సి వచ్చింది టాలీవుడ్. మధ్యలో చాలా సినిమాలు వచ్చినా కూడా నాంది మినహా మరే సినిమా ఆకట్టుకోలేదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది.
మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలైన జాతి రత్నాలు సినిమా సంచలన విజయం సాధించింది. ఈ చిత్ర వసూళ్లు.. సాధించిన విజయం చూసి నిర్మాతలు కూడా షాక్ అవుతున్నారు.ఎందుకంటే తమ సినిమా బాగా ఆడుతుందని నమ్మారు కానీ మరీ ఈ స్థాయిలో కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తుందని వాళ్లు కూడా నమ్మలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు టైమ్ మరింత కలిసొచ్చింది.
ఎందుకంటే మార్చి 19న విడుదలైన మూడు సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చింది. మంచి అంచనాలతో వచ్చిన చావు కబురు చల్లగా.. మంచు విష్ణు మోసగాళ్లు సినిమాలకు టాక్ తేడాగా వచ్చింది. మరోవైపు ఆది శశి సినిమా వచ్చినట్లు కూడా ఆడియన్స్కు తెలియదు. దాంతో ఈ మూడు సినిమాలు తొలిరోజే వాష్ ఔట్ అయిపోయాయి. అందుకే రెండో వారం కూడా జాతి రత్నాలు సినిమాకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు ప్రేక్షకులు. అంతేకాదు రెండో వారంలో ఈ సినిమాకు కొన్ని స్క్రీన్స్ కూడా యాడ్ చేస్తున్నారు.
ఎలాగూ కొత్త సినిమాలకు టాక్ బాగోలేకపోవడంతో.. ఇప్పటికే బ్లాక్ బస్టర్గా ఉన్న జాతి రత్నాలు వైపు అడుగులు వేస్తున్నారు ఆడియన్స్. దాంతో సెకండ్ వీకెండ్ కూడా కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఎలా చూసుకున్నా కూడా ఈ 3 ఇడియట్స్ నిజంగా పెట్టిపుట్టారేమో అనిపిస్తుంది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ఈ చిత్రాన్ని అనుదీప్ తెరకెక్కించాడు. నాగ్ అశ్విన్ ఈ సినిమాతో నిర్మాతగా మారిపోయాడు.
అమెరికాలో కరోనా తర్వాత 1 మిలియన్ వైపు అడుగులు వేస్తున్న తొలి సౌత్ ఇండియన్ సినిమా ఇదే కావడం గమనార్హం. అందుకే థ్యాంక్స్ చెప్పడానికి యుఎస్ కూడా వెళ్లారు ఈ జాతి రత్నాలు. ఇప్పటికే ఈ చిత్రం 32 కోట్ల షేర్ వసూలు చేసింది.
ఇవి కూడా చదవండి..
‘ఉప్పెన’ క్లోజింగ్ కలెక్షన్స్.. వైష్ణవ్ తేజ్ ఆల్ టైమ్ రికార్డ్
ఈ వారం బ్యాడ్ ఫ్రైడే.. అన్ని సినిమాలు డీప్ ఫ్రై..
ప్రభాస్ కంటే అల్లు శిరీష్ సినిమాకే రికార్డులు ఎక్కువ..