పాట్నా: రైతును హత్య చేసిన ఏడుగురికి ఫాస్ట్ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బీహార్లోని భాబువా జిల్లాకు చెందిన రైతు రాజ్ కిశోర్ సింగ్ 2011 నవంబర్ 25న రాత్రి వేళ పంప్ హౌస్ వద్ద నిద్రించగా ఏడుగురు హత్య చేశారు. రైతు కుమారుడు ఉదయ్ ప్రతాప్ సింగ్ ఫిర్యాదుతో నిందితులు భోరిక్ రామ్, జే ప్రకాష్ రామ్, రామ్ ఆశిష్ రామ్, జితేంద్ర రామ్, మున్నా రామ్, రవికాంత్ రామ్, ఉమేష్ రామ్పై పోలీసులు హత్య, సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
మరోవైపు కోర్టులో ఈ కేసు విచారణ సుమారు పదేండ్లపాటు సాగింది. జిల్లా ఫ్రాస్ట్ట్రాక్ కోర్టు జడ్జి ఓం ప్రకాశ్ సింగ్ మంగళవారం తీర్పు ఇచ్చారు. రైతు రాజ్ కిశోర్ సింగ్ను హత్య చేసిన ఏడుగురు నిందితులను దోషులుగా నిర్ధించారు. యావజ్జీవ కారాగార శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.20,000 జరిమానా విధించారు. అది చెల్లించకపోతే మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.