మంత్రి హరీశ్రావుకు బీసీనేత ఆర్ కృష్ణయ్య వినతి
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): బడ్జెట్లో బీసీ కులాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. కృష్ణయ్య నేతృత్వంలో పలువురు బీసీ ప్రతినిధులు మంగళవారం ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావుకు వినతిపత్రం సమర్పించారు. బీసీ కార్పొరేషన్కు సబ్సిడీ రుణాల కోసం రూ.5 వేల కోట్లు, 12 బీసీ కులాల ఫెడరేషన్లకు జనాభా ప్రాతిపదికన ఒక్కో కార్పొరేషన్కు రూ.200 కోట్లు కేటాయించాలని కోరారు. బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజుల కోసం అదనంగా రూ.200 కోట్లు, ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ తదితర కోర్సులకు పూర్తి ఫీజులు ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. బీసీల కులాల అభ్యున్నతికి బడ్జెట్ పెంచాలని సీఎంకేసీఆర్ ఆదేశించడంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారని ఆర్ కృష్ణయ్య తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, ముత్యం వెంకన్నగౌడ్, జిల్లిపల్లి అంజి, ఉదయ్కుమార్, చంటి ముదిరాజ్, కిశ్ర్, ఆర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్: ఆర్థికంగా వెనుకబడి ఉన్న చెప్పు, డప్పు వృత్తిదారులకు ప్రతినెలా పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ కోరారు. ఈ మేరకు పలువురు సంఘం నాయకులతో కలిసి మంగళవారం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు వినతిపత్రం అందజేశారు.
చిక్కడపల్లి: ప్రతి ఎంపీటీసీ సభ్యుడికి గ్రామ అభివృద్ధి కోసం ఏటా రూ.20 లక్షల నిధులు కేటాయించాలని తెలంగాణ ఎంపీటీసీల సం ఘం అధ్యక్షుడు గడిల కుమార్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వం తమ న్యాయమైన 36 డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తిచేశారు. మంగళవారం చిక్కడపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన ఆ సంఘం కార్యవర్గ సమావేశంలో కుమార్గౌడ్ మాట్లాడారు.