హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పాఠాలు ఆన్లైన్లో లభ్యం కానున్నాయి. సైన్స్ పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రయోగాల వీడియోలను ఆన్లైన్లో విద్యార్థులకు అందించాలని ఇంటర్బోర్డు నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకరోజు ఫస్టియర్వారికి, తర్వాతిరోజు సెకండియర్ విద్యార్థులకు తరగతులు జరుగుతున్నాయి. దాంతో ఒక్కో తరగతివారికి 34 రోజులు మాత్రమే క్లాసులు ఉంటాయి. మేలో జరిగే ఇంటర్ వార్షిక పరీక్షల మోడల్ ప్రశ్నపత్రాలను ఇంటర్బోర్డు వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని రద్దుచేసినట్టు ఇంటర్బోర్డు అధికారులు తెలిపారు.
ఇంటర్ పరీక్ష ప్రశ్నావళిలో కరోనా వైరస్ చోటుదక్కించుకున్నది. ఇదేంటని అనుకుంటున్నారా? కానీ, ఇది నిజమే. యావత్తు ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్కు సంబంధించిన ఓ ప్రశ్నను ఇంటర్మీడియట్ ఇంటర్నల్ పరీక్షలో అడగాలని ఇంటర్బోర్డు నిర్ణయించింది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పేపర్లో కొవిడ్పై ప్రశ్న అడగనున్నారు.