మల్కాజిగిరి/హిమాయత్నగర్, మార్చి 12: ‘పట్టభద్రుల సమస్యలే కాదు.. బాపుతో దేశవిదేశాలు తిరిగి సామాజిక సమస్యలపైనా పూర్తి అవగాహన పెంచుకున్నాను.. ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వస్తున్నాను.. అవకాశం ఇవ్వండి, నేనేంటో రుజువు చేసుకుంటా’ అని ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్ వాణీదేవి విజ్ఞప్తిచేశారు. శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గంలోని గౌతంనగర్లో కార్పొరేటర్ మేకల సునీతరాముయాదవ్, ఈస్ట్ ఆనంద్బాగ్లో కార్పొరేటర్ ప్రేంకుమా ర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో వాణీదేవి పాల్గొన్నారు. హిమాయత్నగర్లోని భూపతిసదన్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మణికొండ సురేశ్కుమార్ అధ్యక్షతన జరిగిన పట్టభద్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యావేత్తగా పట్టభద్రుల సమస్యలపై తనకు అవగాహన ఉన్నదని చెప్పారు. భావితరాల కోసం బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్న సీఎం కేసీఆర్కు, ప్రభుత్వానికి ప్రజలంతా పూర్తిస్థాయిలో మద్దతు తెలు పాలని కోరారు. మొదటి ప్రాధాన్య ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, వొడితెల సతీశ్కుమార్, దానం నాగేందర్, డాక్టర్ సంజయ్కుమార్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, జలమండలి ఇంజినీర్స్ అసోసియేషన్, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, మున్సిపల్ ఎంప్లాయీస్ సెంట్రల్ ఫోరం, మున్సిపల్ కార్పొరేషన్స్ అసోసియేషన్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పాల్గొని వాణీదేవికి ఓటేయాలని కోరారు. రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజేస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారాయణగూడలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎస్ వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు మద్దతుగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.