కుత్బుల్లాపూర్ జోన్బృందం,మార్చి7: బాచుపల్లిలోని శ్రీనివాస లేక్ వ్యూ, ఎస్ఏవీఎస్ అపర్ణ వద్ద మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మానగర్ ఫేస్-2లో ఎమ్మెల్యే కేపీ. వివేకానందతో కలిసి డివిజన్ అధ్యక్షుడు కేఎం. గౌరీశ్, మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, నాయకులు మాధవరెడ్డి, సత్తిరెడ్డి, డి.శ్రీనివాస్తో పాటు కాలనీవాసులతో కలిసి ప్రచారం చేపట్టారు. 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సోమయ్యనగర్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేటర్ కొలుకుల జగన్తో కలిసి ప్రచారం చేపట్టారు. సూరారం, సుభాష్నగర్ డివిజన్ల పరిధిలోని సంజయ్గాంధీనగర్లలో మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేశ్రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం చేపట్టారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మార్నింగ్ వాకింగ్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రచారం చేపట్టగా దూలపల్లి గ్రామంలో కౌన్సిలర్ డప్పు కిరణ్కుమార్, ఎన్నికల ఇన్చార్జి రఘు, నాయకులు సుధాకర్ కలిసి ప్రచారం చేపట్టారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట జేఎన్ఎన్ యూఆర్ఎం కాలనీతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్యాదవ్, సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి, మురళియాదవ్, విష్ణువర్ధన్రెడ్డి, సురేందర్రెడ్డి పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్,మార్చి7: సురభి వాణీదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం తన కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 14న జరిగే ఎన్నికల్లో పట్టభద్రులు వాణీదేవికి ఓటు వేసేలా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పలు సూచనలు ఇచ్చారు. అంతకుము ముందు బౌరంపేట, మల్లంపేటలో ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జక్కుల శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ కృష్ణ, మాజీ ఎంపీటీసీ బి.మహేశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి సురభివాణీదేవి గెలుపునకు పట్టభద్రులంతా ఏకమై అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు గంగస్థాన్ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దూలపల్లి పీఏసీఎస్ చైర్మన్ గరిశె నరేందర్రాజు, కొంపల్లి మున్సిపాలిటీ వైస్చైర్మన్ గంగయ్యనాయక్, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బ్యాంకు కాలనీ వార్డు సభ్యుడు సుధాకర్గౌడ్ ఆధ్వర్యంలో విద్యావంతులను, మేధావులను, పట్టభద్రులను నేరుగా కలిసి ఇంటింటికీ తిరిగి సురభి వాణీదేవి గెలుపు కోసం విస్తృత ప్రచారం చేపట్టారు. ఆదివారం కాలనీలో కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు.