కొండాపూర్, మార్చి 5: సమస్త జీవరాశికి జలం జీవనాధారమని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మాదాపూర్లోని శిల్పకళా వేదికలో ఇండియన్ వాటర్ వర్క్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజు ల పాటు కొనసాగుతున్న 53వ వార్షిక సమావేశ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ మానవ జీవనానికి పరిశుభ్రమైన తాగునీరు, స్వచ్ఛమై న గాలి, బలమైన ఆహారం అవసరమన్నా రు. స్వచ్ఛమైన వర్షపునీటిని సేకరించి భద్రపరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రభుత్వం రూ.40 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం ద్వారా ఉపరితల నీటిని సేకరించి ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నదన్నారు. ఇంత పెద్ద పథకం విజయవంతంగా పూర్తయిందంటే దానికి ఇంజనీర్ల కృషి, పట్టుదలే కారణమన్నారు. తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ప్రతి చుక్కను ఒడిసి పట్టి ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇజ్రాయిల్ ప్రపంచానికి చూపుతున్నదన్నారు. దేశంలో నదుల ద్వా రా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకుం టే దేశ వ్యాప్తంగా తాగు, సాగునీటికి డోకా ఉండదన్నారు. గతంలో లాగా ఎండకాలం వచ్చిందంటే తాగునీటి కోసం ధర్నా లు, ఆందోళనలు ప్రస్తుతం లేవని, రాష్ట్ర ప్రభుత్వం, ఇంజనీర్ల సహకారంతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నా రు. కార్యక్రమంలో నగర జలమండలి ఎండీ దానకిశోర్, ఇండియన్ వాటర్ వ ర్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా॥ సత్యనారాయణ, కొండాపూరెడ్డి పాల్గొన్నారు.