సామాజిక సేవా దృక్పథం స్ఫూర్తిదాయకం
24న ముక్కోటి వృక్షార్చనలో మొక్కలు నాటాలి
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం అధ్యక్షుడిగా ఈశ్వరప్రగడ
ఖమ్మం కల్చరల్, జూలై 18: విద్య, వైద్య, మౌలిక వసతుల కల్పనలో విస్తృత సేవలందిస్తున్న లయన్స్ క్లబ్ సేవలు ఆదర్శనీయమని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రశంసించారు. ఖమ్మం బైపాస్ రోడ్డులోని శ్రీశ్రీశ్రీ హోటల్లో ఆదివారం నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ఏళ్లుగా వితరణ, సేవా దృక్పథంతో సామాజిక సేవలు చేపట్టడం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు తమదైన భాగస్వామ్యం వహించడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టే ముక్కోటి వృక్షార్చనలో క్లబ్ సభ్యులు విస్తృతంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోనూ సేవలను విస్తరింపజేస్తున్న క్లబ్ బాధ్యులను అభినందించారు.
లయన్స్ డీజీ అమృతవల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ క్లబ్ సేవలను వివరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం (స్తంభాద్రి) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఈశ్వరప్రగడ హరిబాబు మాట్లాడుతూ క్లబ్ ఇంటర్నేషనల్, మంత్రి అజయ్కుమార్ సహకారంతో ఖమ్మం నగరానికి శాశ్వత ప్రయోజనాన్ని ఇచ్చే ప్రాజెక్టు నిర్మించడమే తన ఆశయమన్నారు. ఈ సందర్భంగా క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఈశ్వరప్రగడ హరిబాబు, కార్యదర్శిగా బచ్చు ప్రసాద్, కోశాధికారిగా లక్ష్మీలత, ఇతర కార్యవర్గ సభ్యులతో లయన్ పీడీజీ రమేశఖ, డీజీ వెంపటి లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. లయన్స్ క్లబ్ బాధ్యులు తీగల మోహన్రావు, మాడిశెట్టి మదన్మోహన్, నల్లమల ప్రసాద్, రాఘవరెడ్డి, మురళీధర్రావు, వీఎల్ వెంకటేశ్వరరావు, కృష్ణవేణి, కనకపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిబాబును మంత్రి అజయ్ శాలువాతో సత్కరించి అభినందించారు.