ఆయన పాలనాదక్షత వల్లే అభివృద్ధి పథంలో తెలంగాణ
ములకలపల్లి మండల పర్యటనలో మాజీ ఎంపీ పొంగులేటి
ములకలపల్లి/ దమ్మపేట, అక్టోబర్ 17: సీఎం కేసీఆర్ గొప్ప దార్శనికుడని, ఆయన పాలనాదక్షత వల్లే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం పర్యటించిన ఆయన.. నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, టీఆర్ఎస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్కుమార్, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, అన్నపురెడ్డిపల్లి ఎంపీపీ సున్నం లలిత, ఎంపీటీసీ శెనగపాటి మెహరామణి, సర్పంచ్లు సున్నం సుధాకర్, సవలం సుజాత, బైటి రాజేష్, కారం సుధీర్కుమార్, గొల్ల పెంటయ్య, గడ్డం భవానీ, వాడే నాగరాజు, ఎంపీటీసీ కొర్రి భద్రం, మెహరామణి, నాయకులు బాల అప్పారావు, కొమురయ్య, నాగరాజు, బైటి రాము, కోండ్రు సుందర్రావు, వేముల సతీశ్, ముదిగొండ గోపి, శెనగపాటి రవి, పుష్పాల చందర్రావు, సురభి రాజేశ్, నున్నా జగదీశ్, సోయం చిన్నారి, షఫీ, సున్నం ముత్యాలు, అడపా నాగేశ్వరరావు, తుర్రం శ్రీనివాస్, సురభి రాజేశ్, వెంకటేశ్, శెనగపాటి అంజన్రావు, రాజారావు, గుంటూరు కృష్ణ పాల్గొన్నారు.
దమ్మపేటలో..
దమ్మపేట మండలం పట్వారిగూడెం వాసి, సూర్యాపేట డీఎస్పీ మోహన్కుమార్ తల్లి లక్ష్మీపారిజాతం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. అయితే ఆమె దశదినకర్మకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీపారిజాతం చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోహన్కుమార్ను, కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, దారా మల్లికార్జునరావు, కొయ్యల అచ్యుతరావు, కోటగిరి సత్యంబాబు, రావు గంగాధర్రావు, దారా యుగంధర్, గోపీశాస్త్రి, రెడ్డిమళ్ల నాగయ్య పాల్గొన్నారు.