కొత్తగూడెం, సెప్టెంబర్ 17: జిల్లా పరిధిలోని జాతీయ రహదారులకు మరమ్మతులు చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రాంతీయ అధికారి కేఎస్కే కుష్వహా, కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శుక్రవారం వారు జాతీయ రహదారుల ఇంజనీరింగ్శాఖ అధికారులతో కలిసి పట్టణంలోని మొర్రేడువాగు, గోధుమవాగులపై నిర్మిస్తున్న వంతెనలు, ఎస్సీబీ నగర్, సింగరేణి మహిళా కళాశాల ప్రహరీ, సెయింట్ మేరీస్ హైస్కూల్ ప్రహరీ పనులను పరిశీలించారు. అనంతరం కల్టెరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చాలన్నారు. భద్రాచలంలోని గోదావరిపై నిర్మిస్తున్న రెండో వంతెన పనులను యుద్ధప్రాతిపకదిన పూర్తి చేయాలన్నారు. వంతెనల నిర్మాణం పూర్తికాకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వచ్చే ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లోని రహదారులపై కల్వర్టులు నిర్మించాలన్నారు. ముసలిమడుగు వద్ద రహదారి విస్తరణకు అటవీ భూమిని కేటాయించాలని అటవీ అధికారులను కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, రాజ్దీప్ నిర్మాణ సంస్థ ఎండీ రాజీవ్ కటారియా, రోడ్లు భవనాలశాఖ ఈఈ బీమ్లా, ఎఫ్డీవో అప్పయ్య, జీసీసీ జీఎం వాణి పాల్గొన్నారు.