ఖమ్మం ఎడ్యుకేషన్, అక్టోబర్ 16 : దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. ఐఐటీ ఖరగ్పూర్ శుక్రవారం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రకటించాయి.
న్యూవిజన్ ప్రభంజనం ..
ఎస్టీ కేటగిరిలో 3వ ర్యాంక్, వివిధ కేటగిరిల్లో వెయ్యిలోపు 14మంది ర్యాంకులు సాధించినట్లు న్యూవిజన్ కళాశాల చైర్మన్ చుంచు గోపాలకృష్ణ ప్రసాద్ తెలిపారు. హారిక 1వ ర్యాంక్, ఐ.నితిన్ 3వ ర్యాంక్, యశస్వి-162, తేజాపవర్-262, జశ్వంత్-297, జ్ఞానేశ్వరి-307, దినేశ్-357, ఆర్యన్-372, సాయివిఘ్నేష్-465, ఈశ్వర్-474, చరణ్యశ్రీ-634, మానస-754, అజయ్కుమార్-776, చంద్రిక-933, లావణ్య-1287 ర్యాంక్లు సాధించారన్నారు. కళాశాల నుంచి ఐఐటీలో 16, ఎన్ఐటీలో48, ఎంబీబీఎస్లో 36 మంది ప్రతి సంవత్సరం చేర్చుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను డైరెక్టర్ సీహెచ్ గోపిచంద్, ప్రిన్సిపాల్ బ్రహ్మచారి అభినందించారు.
శ్రీచైతన్య హవా..
కళాశాల విద్యార్థులు జాతీయస్థాయి ర్యాంకులు సాధించినట్లు శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య తెలిపారు. కళాశాలకు చెందిన ఇమిత్యాశ్-60వ ర్యాంక్, శ్రీనివాస్-111, స్రవంత్కుమార్-127, హనీష్-159, నిఖిల్-233, రిషి మనోజ్-244, శివసందీప్-253, వినోద్కుమార్-315, శ్రీనివాస్ ఆదిత్య-349, అరుణ్-349, వివేక్-371, కల్యాన్-518, ఆకాష్-527, యోగేశ్-642, విఘ్నేశ్-657, కృష్ణవేణి-809, రవళిక-884, దీప్తి-915, సాయి శ్రీనివాస్-973వ ర్యాంకులు, 500లోపు 11, వెయ్యిలోపు 20, 2వేలోపు 30, 5వేల లోపు 70 ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను అకడమిక్ డైరక్టర్ బి.సాయిగీతిక, డీజీఎం చేతన్మాధుర్, డీన్ వర్మ, ఏజీఎంలు చిట్టూరి బ్రహ్మం, జి.ప్రకాశ్, జి గోపాలకృష్ణ అభినందించారు.
కృష్ణవేణి విద్యార్థుల సత్తా ..
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో విద్యార్థులు విజయకేతనం ఎగురవేసినట్లు విద్యాసంస్థల అధిపతి యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. నిహారిక-110, ల్యానిత్ చౌహాన్-148, దీపక్-191, యశ్వంత్-702, నవీన్-1110, కౌషిక్-1431, రాంబాబు-1709, వర్షిని-2033, నాగముకేశ్-3123, విఘ్నేశ్-5908వ ర్యాంకులు సాధించారు. ర్యాంకుల సాధించిన విద్యార్థులు, అధ్యాపకులను డైరెక్టర్స్ గొల్లపూడి జగదీశ్, మాచవరపు కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రామచందర్రావు, అధ్యాపకులు అభినందించారు.
హర్వెస్ట్ విజయభేరి…
కళాశాల నుంచి 28మంది పరీక్ష రాయగా 10మంది అర్హత సాధించినట్లు హార్వెస్ట్ విద్యాసంస్థల అధినేత పోపూరి రవిమారుత్ తెలిపారు. మేడూరి హర్షిత్ చౌదరి -49వ ర్యాంక్, విశాల్ మ్యాథ్యూస్-140, కార్తిక్-456, నిహంత్-569, ప్రణయ్-2,410, గిరిధర్-2,574, నారాయణరావు-3,261, కార్తికేయ-4,637వ ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల కృషి విజయాలకు కారణమని ప్రిన్సిపాల్ పార్వతీరెడ్డి పేర్కొన్నారు.
రెజొనెన్స్ విజయకేతనం..
కళాశాలకు చెందిన యశ్వంత్ అఖిల్-121, చందనమౌర్య-644, వరుణ్-2,726, విజయ్కుమార్-3,802వ ర్యాంక్ సాధించినట్లు కళాశాల డైరెక్టర్లు రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్ పేర్కొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులను ప్రిన్సిపాల్స్ సతీశ్, భాస్కర్రెడ్డి, రాంబాబు అభినందించారు.