కొత్తగూడెం, సెప్టెంబర్ 16: అందరి ఆరాధ్యదైవం విజయవిగ్నేశ్వరస్వామి అని, ఆ గణపయ్యపైనే అపారనమ్మకమని కొత్తగూడం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. అందుకే గణపతి ఆలయానికి రూ.3.50 కోట్లతో కల్యాణ మండపం మంజూరు చేసినట్లు చెప్పా రు. గణేశ్ టెంపుల్లో కొత్తగా ఎన్నికైన పాలకమండలి సభ్యులతో గురువారం ఈవో శ్రీనివాస్ ప్రమాణ స్వీకా రం చేయించారు. చైర్మన్గా తాటిపల్లి శంకర్బాబును కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడారు. కోరుకున్న కోరికలు నెరవేర్చే గణపయ్య ఆలయానికి చాలా విశిష్టత ఉందని అన్నారు. త్వరలో రాజగోపుర నిర్మాణమూ చేపడతామన్నారు. త్వరలో పెద్దమ్మతల్లి ఆలయం వద్ద కూడా కల్యాణమండపం నిర్మిస్తామని అన్నారు. గణేశ్ టెంపుల్ నూతన చైర్మన్ తాటిపల్లి శంకర్బాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో చైర్మన్ పదవి ఇచ్చిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కు రుణపడి ఉంటానని అన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, మున్సిపల్ చైర్మన్ సీతాలక్ష్మి, ఎంపీపీలు సోనా, శాంతి, విజయలక్ష్మి, ఆత్మ కమిటీ చైర్మన్ వీరయ్య, సొసైటీ చైర్మన్ వీరహన్మంతురావు, ఏఎంసీ చైర్మన్ రాంబాబు, ఉర్ధూఘర్ చైర్మన్ అన్వర్ పాషా, కౌన్సిలర్ జయంతి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే వనమాను గజమాలతో సత్కరించారు. టెంపుల్ కమిటీ సభ్యులకు మెమెంటోలను అందజేశారు.