రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్
నగరంలో ఇంటింటికీ వెళ్లి 185 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
ఖమ్మం/ రఘునాథపాలెం, సెప్టెంబర్15: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి తెలంగాణ ప్రభుత్వం కానుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అందజేస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం ఆయన నగర పరిధిలోని 27, 28, 29, 30, 31, 32, 33, 36, 46, 47, 48, 15, 14, 8, 3, 2వ వార్డులతో పాటు గొల్లగూడెం, వైఎస్సార్ నగర్, పుట్టకోట, బాలప్పేట, బల్లేపల్లి, పాండురంగాపురంలో 185 మంది లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు సారె అందజేసి మాట్లాడారు. ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. తొలుత నగరంలో నాయకులతో కలిసి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ పాతీమజోహారా, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, ఏఎంసీ చైర్మన్ ప్రసన్నలక్ష్మి, కార్పొరేటర్లు కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ, తోట గోవిందమ్మ రామారావు, మాటేటి అరుణ నాగేశ్వరరావు, మాటేటి కిరణ్కుమార్, రావూరి సైదిబాబు, కురాకుల వలరాజు, దండా జ్యోతిరెడ్డి, రుద్రగాని శ్రీదేవి, గజ్జెల లక్ష్మి, నాయకులు దండగల రాంబాబు, గజ్జెల వెంకన్న, రుద్రగాని ఉపేందర్, తోట వీరభద్రం, తోట ఉమారాణి, నర్రా యల్లయ్య, కుర్రా మాధవరావు, ఎండీ ఫయాజ్, చిలుమూరు కోటి, ప్రసాద్, షేక్ వలీ తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్లకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన
నగరంలోని 17వ డివిజన్లో రూ 30 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లకు బుధవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి నగరపాలక సంస్థ కమిషనర్ స్నేహలత, సహాయ కమిషనర్ మల్లీశ్వరి,కార్పొరేటర్ ధనాల రాధ, డీఈ ధరణీకుమార్ ఏఈ సతీశ్, నాయకులు పాలడుగు పాపారావు, ఆర్జేసీ కృష్ణ పాల్గొన్నారు.