కేఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్కు షాక్
నగర అభివృద్ధే ప్రధానమంటున్న నేతలు
ఖమ్మం, ఏప్రిల్14: ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తున సమయంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంత్రి పువ్వాడ సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిద్దామన్నారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు ఇస్సాక్, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బండి మణి, మాజీ సర్పంచ్ భూక్యా బాషా, యూత్ నాయకులు ఇంతియాజ్, గౌస్తో పాటు 50 మంది క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, జిల్ల గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, పార్టీ కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, మాజీ కార్పొరేటర్ షౌకత్ఆలీ, నాయకులు తాజుద్దీన్, కుర్రా భాస్కర్రావు, కొనకంచి ప్రసాద్, కట్రాల శ్రీరాములు, నరేశ్, వెంకన్న, వీరన్న, రాంప్రసాద్, శ్రవణ్, సురేశ్ తదితరులు ఉన్నారు.