గండి ఒర్రె చెరువు అలుగు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలి
వ్యవసాయ మీటర్లకు త్రీఫేజ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలి
కరకగూడెం పర్యటనలో ప్రభుత్వ విప్, పినపాఎ ఎమ్మెల్యే రేగా
కరకగూడెం, సెప్టెంబర్ 13: ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, రేగా కాంతారావు సోమవారం కరకగూడెం మండలంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత తుమ్మలగూడెం పరిధిలోని గండి ఒర్రె చెరువు అలుగును పరిశీలించారు. నిరుడు భారీ వర్షాలకు గండి ఒర్రె చెరువు అలుగు కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన అలు గు ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన.. అలుగు నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అనంతరం బుగ్గచెరువు అలుగు మరమ్మతులు చేపట్టాలని పద్మాపురం రైతులు విప్ రేగాను కోరగా ఆయన స్పందించారు. వెంటనే అలుగు మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తుమ్మలగూడెం, రేగుళ్ల, చొప్పాల గ్రామాల్లో రైతులతో మాట్లాడారు. పొలాల్లో రైతుల విద్యుత్ బోర్లకు త్రీఫేజ్ లైన్ ఏర్పాటు చేయాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. తుమ్మలగూడెం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పౌష్టికాహార వారోత్సవాలకు హాజరై చిన్నారులకు పౌష్టికాహారం అందజేశారు. గర్భిణులకు అంగన్వాడీ సిబ్బంది నిర్వహించిన చేపట్టిన శ్రీమంతాల వేడుకల్లో పాల్గొన్నారు. పడిగాపురానికి చెందిన మద్దెల నిర్మల ఇటీవల డెంగీ తో మరణించగా.. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. రేగా విష్ణు మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో రూ. 20వేలు అందజేశారు. ఎంపీపీ రేగా కాళిక, జడ్పీటీసీ కాంతారావు, ఇరిగేషన్ ఏఈఈ సక్రూ, పీఆర్ ఏఈ వెంకట్, ట్రాన్స్కో ఏఈ రామకృష్ణ, టీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు సోమయ్య, నాయకులు పెదరామలింగం, వెంకటరెడ్డి, రాము, పాపారా వు, ప్రవీణ్, సర్పంచ్లు పాల్గొన్నారు.