కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు
వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్
ఏన్కూరులో టీఆర్ఎస్ గ్రామ కమిటీలు పూర్తి
ఏన్కూరు, సెప్టెంబర్ 13: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ సూచించారు. ఏన్కూరు టీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో ఎల్లప్పుడూ తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. దళితబంధు పథకంతో ఎస్సీల హృదయాల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతున్నారని అన్నారు. 70 ఏళ్లలో సాధించని అభివృద్ధి కేవలం ఏడేళ్లలో చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేశ్నాయక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ధర్మారావు, నాయకులు మైసారావు, చందులాల్, శోభన్నాయక్, వల్లేశ్వరరావు, సత్యనారాయణ, సైదులు పాల్గొన్నారు.
గ్రామ కమిటీల ఎన్నికలు పూర్తి
టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నికలు పూర్తయినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు బాణోతు సురేశ్నాయక్ సోమవారం తెలిపారు. మొత్తం 25 గ్రామాలకు గాను 25 గ్రామ కమిటీల ఎన్నికలు పూర్తయినట్లు వెల్లడించారు. గ్రామ కమిటీల పేర్లను ఎమ్మెల్యే రాములునాయక్కు పంపినట్లు చెప్పారు.