ఆక్సిజన్, రెమ్డెసివర్ కొరత లేదు
మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం, మే 10 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్తో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో రాష్ట్రంలో ఇంటింటా జ్వర సర్వే చేపడుతున్నామన్నారు. కొవిడ్ను కట్టడి చేయడానికి ప్రభుత్వం, యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తారని అన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదన్నారు. జ్వర సర్వే దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. పాజిటివ్ వచ్చిన బయటకు రావొద్దన్నారు. అవసరమైతే 1077ను సంప్రదించవచ్చన్నారు. ఎవరూ ధైర్యం కోల్పోవద్దన్నారు. ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించవచ్చన్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. కొవిడ్ బారిన పడిన వారు కాల్సెంటర్కు కాల్ చేయవచ్చన్నారు. జిల్లాలో రెమ్డెసివర్కు కొరత లేదని, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితో పాటు సత్తుపల్లి, మధిర ప్రభుత్వాస్పత్రిలో సిద్ధంగా ఉన్నాయన్నారు. సమావేశంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.