ఖమ్మం : కాకతీయ యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న పరీక్షల్లో10మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. కాపీయింగ్ కు పాల్పడుతున్నవిద్యార్థులను డిబార్ చేసినట్లు కేయూ పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ వై వెంకయ్య తెలిపారు. కొత్తగూడెం జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో నలుగురు విద్యార్ధులు కాపీయింగ్కు పాల్పడుతుండగా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.