భద్రాచలం, అక్టోబర్ 9: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీలక్ష్మీ తాయారు అమ్మ వారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో, నదీ జలాలలతో అర్చకులు అభిషేకం చేశారు. మధ్యాహ్నం మహా నివేదన గావించారు. అనంతరం మహిళలతో సామూహిక కుంకుమార్చనలు జరిపారు. అమ్మవారి కోవెలకు అభిముఖంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య తండ్రికి దర్బార్ సేవ నిర్వహించారు.
నేడు ధాన్యలక్ష్మి అలంకారం..
‘ధన, ధాన్య, కరీం.. సిద్ధిం’ అంటూ కీర్తిస్తుంది పురాణం. అన్ని రకాల ధాన్యాన్ని ప్రసాదించేదీ ఈ అమ్మే. ఈ అమ్మను ఆరాధిస్తే ఈతి బాధలన్నీ తొలగుతాయన్నతి భక్తుల నమ్మకం.