కొనసాగుతున్న టీఆర్ఎస్ గ్రామకమిటీల ఎన్నికలు
పార్టీకి కార్యకర్తలే బలం
టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి
అఖండ శక్తిగా టీఆర్ఎస్ : ఎమ్మెల్యే హరిప్రియ
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్యే మెచ్చా
కొత్తగూడెం, ఇల్లెందు, దమ్మపేట, సెప్టెంబర్ 9: గ్రామస్థాయి నుంచి టీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. టీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ కమిటీల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గురువారం ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి, కార్యదర్శి తాతా మధు, మానుకోట ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. పలు చోట్ల గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. 12వ తేదీలోగా అన్ని గ్రామాల్లో కమిటీల నియామకం పూర్తి కావాలని సూచించారు.
టీఆర్ఎస్ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో పార్టీ మండల స్థాయి నాయకులు, గ్రామ కమిటీ నియామక కమిటీ పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని కార్యకర్తలు ప్రజలకు చేరువ చేయాలన్నారు. అందుకు పార్టీ గ్రామ కమిటీలను వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 12లోపే గ్రామ కమిటీల నియామకం పూర్తి కావాలన్నారు. దమ్మపేట మండలవ్యాప్తంగా గ్రామకమిటీలు పూర్తికావడంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. తారతమ్యాలకు పోకుండా అధిష్ఠానం నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించాలని సూచించారు. సమావేశంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి దొడ్డా రమేశ్, సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, ఆత్మచైర్మన్ కేదాసి వెంకట సత్యనారాయణ (కేవీ), ఏఎంసీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, సర్పంచ్ ఉయ్యాల చిన్నవెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ దారా యుగంధర్, పార్టీ ముఖ్యనేత జారె ఆదినారాయణ, నాయకులు రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు, సైదా, అబ్దుల్ జిన్నా, రాఘవరావు, రాధాకృష్ణ, కృష్ణారావు, బుడే, చిట్టిబాబు, ప్రభాకర్, నాగప్రసాద్, శ్రీరామవెంకట్రావు, భరత్కుమార్, శ్రీనివాసరావు, బండి పుల్లారావు, ముబారక్ పాషా తదితరులు పాల్గొన్నారు.
20 ఏళ్లు టీఆర్ఎస్దే అధికారం..
కొత్తగూడెం,సెప్టెంబర్ 9: టీఆర్ఎస్ వంటి ఉద్యమ పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీ అధిష్ఠానం కార్యకర్తలకు అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి అన్నారు. గురువారం కొత్తగూడెం బస్స్టాండ్ సెంటర్లోని టీబీజీకేఎస్ కార్యాలయంలో పార్టీ నాయకుడు వనమా వెంకటేశ్వరరావు అధ్యతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందన్నారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలే మనకు శ్రీరామరక్ష అని అన్నారు. కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నేతలు గ్రామ కమిటీల నియామకాలను సత్వరం పూర్తి చేయాలన్నారు. పార్టీకోసం నిత్యం శ్రమించే వారికి పదవులు వాటంతట అవే వస్తాయని పార్టీ నాయకుడు వనమా రాఘవ అన్నారు. సరైన సమయంలో అందరికీ గుర్తింపు లభిస్తుదన్నారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీలు బాదావత్ శాంతి, సోనా, విజయలక్ష్మి, సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, మున్సిపల్ కౌన్సిలర్లు బాగం మోహన్రావు, లింగం పిచ్చిరెడ్డి, నాయకులు అన్వర్ పాషా, దామోదర్, తూము చౌదరి, మురళి, అనుదీప్ పాల్గొన్నారు.